పాక్లో తొలి మహిళా సీఎంగా మరియం
- International
- February 27, 2024
- No Comment
- 48
పంజాబ్కు తొలి మహిళా సీఎంగా మరియం నవాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ప్రతి మహిళకూ ఎంతో గర్వ కారణమైందని.. ఇకపై మహిళా నాయకత్వ సంప్రదాయం కొనసాగుతుందని తాను ఆశిస్తున్నట్లు నవాజ్ తెలిపారు.
327 సీట్లు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో నవాజ్కు 220 మంది సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో ఆమె ప్రత్యర్థి సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ ఈ ఎన్నిక నుంచి తప్పుకుంది. పీఎంఎల్ ఎన్కు చెందిన 137 మంది సభ్యులతో పాటు 20 మందికి పైగా స్వతంత్రులు, ఇతర చిన్నాచితకా పార్టీల మద్దతుతో మరియం సీఎంగా ఎన్నిక అయ్యారు. పాకిస్థాన్ దేశానికి మూడు సార్లు ప్రధానమంత్రిగా వ్యవహరించిన నవాజ్ షరీఫ్ కుమార్తెనే మరియం నవాజ్. 50 ఏళ్ల మరియం పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ సీనియర్ ఉపాధ్యక్షురాలు.