ఇసుక అక్రమాల కేసులో ఏ2గా చంద్రబాబు
- APPolitics
- November 2, 2023
- No Comment
- 317
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన ఇసుక అక్రమాలపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమతో పాటు.. మరికొందరి పై ఏపీ సీఐడీ కేసు ఫైల్ చేసింది. చంద్రబాబు హయాంలో పీతల సుజాత గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారని.. ఏపీఎండీసీ ఇచ్చిన పిర్యాదుతో కేసు నమోదు చేశారు.