ప్రముఖ వ్యాపారవేత్తతో వరలక్ష్మీ నిశ్చితార్ధం

ప్రముఖ వ్యాపారవేత్తతో వరలక్ష్మీ నిశ్చితార్ధం

వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్‭గా కంటే విలన్‭గానే ఈమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్ దేవ్ తో ఆమె ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మార్చి 1న ముంబైలో ఇరు కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంతో వీరి నిశ్చితార్థం జరిగింది.

తమిళ, తెలుగు చిత్రాల్లో నటిగా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు వరలక్ష్మి.. సీనియర్‌ నటుడు శరత్‌కుమార్‌ కుమార్తెగా వెండితెరకు పరిచయమైనా తన నటన, పాత్రలతో అలరించారు. ఇక నికోలయ్‌ సచ్‌దేవ్‌ ముంబయికి చెందిన వ్యాపారవేత్త. నికోలయ్‌, వరలక్ష్మీలకు 14ఏళ్లుగా పరిచయం ఉంది.

వీరి వివాహానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇద్దరూ తమ వృత్తిగత జీవితాల్లో బిజీగా ఉండటంతో.. వచ్చే ఏడాది వీరి వివాహం జరిగే అవకాశం ఉందని సమచారం. మరోవైపు వరలక్ష్మి అటు తమిళ, ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన హనుమాన్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అటు ధనుష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న రాయన్‌లోనూ నటిస్తున్నారు. దీంతో పాటు మలయాళంలో కలర్స్, తెలుగులో శబరి చిత్రాల్లో వరలక్ష్మీ నటిస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *