బెంగళూరు నగరవీధుల్లో సుధామూర్తి

బెంగళూరు నగరవీధుల్లో సుధామూర్తి

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి కుటుంబం తాజాగా బెంగళూరు వీధుల్లో పర్యటించింది. సుధామూర్తి కుమార్తె, యూకే ప్రథమ మహిళ అక్షతా మూర్తి, మనవరాళ్లతో కలిసి రాఘవేంద్ర మఠ్‌కు వెళ్లారు.

సామాన్య ప్రజల్లాగా రోడ్డుపై దుకాణాల వెంట తిరుగుతూ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన పుస్తకాలను పరిశీలించారు. ఆ సమయంలో వారి దగ్గర్లో ఎలాంటి భద్రతా లేదు. వీరిని గమనించిన స్థానికులు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అయితే.. ఎలాంటి భద్రత లేకుండా నిరాడంబరంగా సామాన్య ప్రజల మధ్యలో వారు తిరగడం చూసిన నెటిజెన్లు సుధామూర్తి కుటుంబంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అంతకుముందు.. బెంగళూరులోని ఓ ప్రాంతంలో నారాయణమూర్తి తన కుమార్తెతో కలిసి ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు. అంతేకాదు వీరిద్దరూ.. నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు.

అలాగే ఇటీవల అక్షత ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘యాన్‌ అన్‌కామన్ లవ్‌: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి’ పేరిట చిత్రా బెనర్జీ అనే రచయిత ఆ పుస్తకాన్ని రచించారు. గత ఏడాది జరిగిన జీ20 శిఖరాగ్రసదస్సులో భాగంగా తన భర్త, యూకే పీఎం రిషి సునాక్‌తో కలిసి అక్షత భారత్ లో పర్యటించారు.

Related post

భయంకరమైన హత్యల నేపథ్యంలో డిటెక్టివ్ తీక్షణ ట్రైలర్

భయంకరమైన హత్యల నేపథ్యంలో డిటెక్టివ్ తీక్షణ ట్రైలర్

యాక్షన్ క్వీన్ డా.. ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం, ‘డిటెక్టివ్ తీక్షణ’ ట్రైలర్, బెంగళూరు లోని ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆడిటోరియంలో గ్రాండ్ ఈవెంట్ లో విడుదల చేశారు. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *