వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రకుల్-జాకీ భగ్నానీ

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రకుల్-జాకీ భగ్నానీ

ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీని విహహం చేసుకుంది. కొన్నాళ్లుగా ప్రేమించుకున్న వీరిద్దరూ.. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

ఫిబ్రవరి 21న గోవాలోని ఐటీసీ గ్రాండ్ లో ఆనంద్ కరాజ్ అనే సంజాబీ సాంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. రెండు రకాల పద్ధతుల్లో ఈ జంట వివాహం చేసుకున్నారు. ముందుగా సిక్కుల సాంప్రదాయం ప్రకారం ఆనంద్ కరాజ్ అనే పద్ధతిలో అలాగే ఆ తర్వాత సింధీ ఆచారాల ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

2021లో తాము ప్రేమించుకుంటున్నామని ఈ జంట ప్రకటించింది. సరిగ్గా మూడేళ్ల తర్వాత గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు రకుల్ అండ్ జాకీ. ఈ వేడుకకు బాలీవుడ్ సినీ ప్రముఖులు తరలివెళ్లి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఇద్దరు ఈ వేడుకలో హుషారైన పాటలతో ఉర్రూతలూగించారు. ఈ వేడుకుకు బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే హాజరయ్యారు. షాహీద్ కపూర్ ఆయన భార్య మీరా, వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సారా అలీఖాన్ కూడా వెళ్లారు.

ఇక రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే.. కెరటం అనే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో ప్రేక్షకులను అలరించింది. పండగ చేస్కో, కరెంట్ తీగ, బ్రూస్ లీ, కిక్ 2, ధ్రువ, విన్నర్, సరైనోడు, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయకా, స్పైడర్, చెక్, మన్మధుడు 2, కొండ పొలం వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు హిందీలోనూ, తమిళంలోనూ సినిమాలు చేస్తోంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *