భయంకరమైన హత్యల నేపథ్యంలో డిటెక్టివ్ తీక్షణ ట్రైలర్

భయంకరమైన హత్యల నేపథ్యంలో డిటెక్టివ్ తీక్షణ ట్రైలర్

యాక్షన్ క్వీన్ డా.. ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం, ‘డిటెక్టివ్ తీక్షణ’ ట్రైలర్, బెంగళూరు లోని ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆడిటోరియంలో గ్రాండ్ ఈవెంట్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లహరివేలు మాట్లాడుతూ.. ఉపేంద్ర తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నారు. చిత్రం మంచి విజయాన్ని సాధించాలని టీమ్ కి బెస్ట్ విషెస్ తెలిపారు. నిర్మాతలు గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం.బి.కోయురు తమ ఆనందాన్ని పంచుకున్నారు. రియల్ స్టార్ ఉపేంద్ర ‘డిటెక్టివ్ తీక్షణ’ ట్రైలర్ ను పలు భాషల్లో విడుదల చేశారు.

భయంకరమైన హత్యల నేపథ్యంలో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ హత్యలు ఎవరు, ఎందుకు చేస్తున్నారు అనే ఆసక్తిని రేకెత్తించడంతో పాటు.. హత్యకి గురైన వారి కుటుంబ సభ్యుల మనోవేదనను కూడా ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. కోర్టులు కూడా ఈ హత్యలకు అడ్డుకట్ట వేయలేకపోతాయి. అటువంటి పరిస్థితుల్లో డిటెక్టివ్ తీక్షణగా ప్రియాంక ఉపేంద్ర ఈ కేసును సాల్వ్ చేయడానికి ఎంట్రీ ఇస్తుంది. ట్రైలర్ ఆద్యంతం హైటెక్నికల్ వాల్యూస్ తో ,రిచ్ ఫోటోగ్రఫీ, టెర్రిఫిక్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకునేలా సాగింది. యాక్షన్ సన్నివేశాలలో కూడా ప్రియాంక ఉపేంద్ర తన స్టంట్స్ తో మెప్పించారు. ఈ ట్రైలర్ చిత్రం మీద అంచనాలను మరింతగా పెంచింది.

Related post

బెంగళూరు నగరవీధుల్లో సుధామూర్తి

బెంగళూరు నగరవీధుల్లో సుధామూర్తి

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *