జితేందర్ రెడ్డి పార్టీ మార్పుపై రఘునందన్ ఫైర్
- TelanganaPolitics
- March 19, 2024
- No Comment
- 42
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పార్టీ మార్పుపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీలో పెద్ద పెద్ద పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీకి సిద్ధాంతం లేదని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పెద్ద పదవులు అనుభవించి.. పార్టీకి సిద్ధాంతం లేదని మాట్లాడుతారా అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు.
ఏ ఆర్థిక ప్రయోజనాల కోసం మీరు పార్టీ మారారు అంటూ జితేందర్ రెడ్డిపై రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి కొత్తగా సిద్దాంతాలు నేర్పించాల్సిన అవసరం లేదని మండిపడ్డారాయన.