ఓటు కోసం షూటింగ్‭కు మెగా హీరో బ్రేక్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కారణంగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగుకు బ్రేక్ ఇచ్చారు.

ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. మైసూర్ నుంచి ఓ ప్రైవేట్ విమానంలో హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. జూబ్లీహిల్స్‌ క్లబ్‌ పోలింగ్‌ బూత్‌ 149లో.. తన ఫ్యామిలీతో కలిసి ఆయన ఓటు వేశారు. అంతకుముందు.. మైసూరు విమానాశ్రయం సిబ్బంది.. రామ్ చరణ్ తో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. ప్రయాణ హడావిడిలో ఉన్నప్పటికీ చెర్రీ ఎంతో ఓపికగా అభిమానులతో ఫొటోలు దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా గేమ్ ఛేంజర్ సినిమా సమకాలీన రాజకీయాలు, ఎన్నికల నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. కమర్షియల్‌ అంశాలకు ప్రాధాన్యత నిస్తూనే సందేశాత్మకంగా గేమ్‌ ఛేంజర్‌ను శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ఘనవిజయం సాధించడంతో రామ్‌ చరణ్‌ ప్యాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు. దాంతో ఆయన తదుపరి సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Related post

రేవంత్ రాజీనామా చేస్తే.. నేను సీఎం అవుతా: హరీష్ రావు

తెలంగాణలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీలో కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు కేటీఆర్, హరీష్ రావు కౌంటర్ ఇస్తున్నారు.

పదేళ్లు నేనే సీఎం.. కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్.. ఇక రణరంగమే..!

తుంటి ఎముక సర్జరీ అనంతరం కోలుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *