ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలే: రాహుల్
- Telangana
- August 20, 2023
- No Comment
- 455
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఒక్క అంగుళం భూమి కూడా మనం కోల్పోలేదని ప్రధాని చెప్పిన మాటల్లో వాస్తవం లేదన్నారు. భారత భూభాగంలోకి చైనా ఆర్మీ ప్రవేశించిందన్న విషయం ఇక్కడి స్థానికులు చెప్పారని అన్నారు. లద్దాఖ్లోని లేహ్లో పర్యటిస్తోన్న ఆయన సరిహద్దు పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో మోటార్ సైకిల్ యాత్ర సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత భూభాగంలోకి చైనా సైన్యం ప్రవేశించిందని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇంతకుముందు పశువుల మేతకు వినియోగించిన ప్రదేశానికి ఇప్పుడు వెళ్లలేకపోతున్నామని అంటున్నారు. ఒక్క అంగుళం కూడా భూమి కోల్పోలేదని ప్రధాని చెబుతున్న మాటలు వాస్తవం కాదని వారి మాటల్లో స్పష్టంగా తెలుస్తోందని.. లద్దాఖ్లో ఎవర్ని అడిగినా.. ఇదే విషయం చెబుతారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన శివసేన నేత సంజయ్ రౌత్.. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందనడానికి ఇదే సరైన ఆధారమన్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి, రక్షణ మంత్రి అంగీకరించకపోతే దేశానికి అన్యాయం చేసినట్లేనని చెప్పారు.