తడిబట్టతో ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన మోదీ

  • National
  • January 13, 2024
  • No Comment
  • 54

ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేసిన అందులో ఓ ప్రత్యేకత ఉంటుంది. మహారాష్ట్ర నాసిక్ లోని ప్రాచీన కాలారామ్ ఆలయాన్ని సందర్శించారు మోదీ.

ఆలయంలోకి వెళ్లిన మోదీ.. స్వచ్ఛ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. బకెట్ నీళ్లను మోసుకెళ్లి తడిబట్టతో ఆలయ ప్రాంగణాన్ని తుడిచారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జరిగే జనవరి 22 వరకు ప్రతిరోజు ఆలయాలన్నింటిని పరిశుభ్రంగా ఉంచాలంటూ మోదీ పిలుపునిచ్చారు. మోదీ ఆలయం శుభ్రం చేసిన వీడియోలు , ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అనంతరం కాలారామ్ మందిరంలో రాములవారి భజనలో మోదీ పాల్గొన్నారు. మోదీ ఆలయంలో కూర్చొని తాళాలు వాయించారు. సంగీత వాయిద్యంతో పలువురు పూజారులు రామ్ భజన పాడారు. అనంతరం మోదీ అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్టోత్సవాలను ప్రారంభించారు. ఈ చారిత్రక శుభకరమైన సందర్భం తన హయాంలో జరగడం అదృష్ణంగా భావిస్తున్నట్లు మోదీ చెప్పుకొచ్చారు.

Related post

దేదీప్యమానంగా వెలిగిపోతున్న బాలరాముడు

ముగ్ధ మనోహర రూపంలో బాలరాముడు అయోధ్యాపురిలో కొలువయ్యాడు.

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట

అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్రృతమైంది. మోదీ చేతుల మీదుగా శాస్త్రోక్తంగా అయోధ్యలో..

జీవం ఉట్టిపడేలా బాలరాముని విగ్రహం

అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టంచనున్న బాల రామయ్య రూపం భక్తులను తన్మయానికి గురి చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *