ఐపీఎల్‭లో కెప్టెన్ మార్పుపై రవిచంద్రన్ షాక్

  • Sports
  • March 20, 2024
  • No Comment
  • 54

సన్ రైజర్స్ హైదరాబాద్ గత ఐపీఎల్ సీజన్ లో అట్టడుగున నిలిచింది. ఈసారి ఎలాగైనా మంచి ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో జట్టులో భారీ మార్పులు చేసింది. ఈక్రమంలోనే ఆస్ట్రేలియాను వన్డే ప్రపంచకప్‌, డబ్ల్యూటీసీ ఛాంపియన్‌గా నిలిపిన పాట్‌ కమిన్స్‌ను వేలంలో 20.50 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. అంతేకాదు ఐదెన్‌ మార్‌క్రమ్‌ స్థానంలో కమిన్స్ ను కెప్టెన్‌గా నియమించింది. సన్‌రైజర్స్‌ మార్‌క్రమ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం గురించి భారత ఆటగాడు, రాజస్థాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. . మార్‌క్రమ్‌ను ఐపీఎల్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో షాక్‌కు గురయ్యానని అశ్విన్‌ పేర్కొన్నాడు.

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మార్‌క్రమ్‌ సారథ్యంలో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌ కేప్‌ వరుసగా రెండు టైటిళ్లు సాధించింది. అత్యద్భుతమైన జట్లతో ట్రోఫీలు అందుకుంది. కానీ, ఐపీఎల్‌లో మార్‌క్రమ్‌ను కాదని కమిన్స్‌ను కెప్టెన్‌గా నియమించారు. నిజంగా ఇది తనకు షాకింగ్ గా అనిపించిందని రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. మార్‌క్రమ్‌నే సారథిగా కొనసాగిస్తారని భావించా.. కమిన్స్‌ను కెప్టెన్‌గా చేయడం వల్ల తుది జట్టు కూర్పులో సన్‌రైజర్స్‌కు ఇబ్బందులు ఎదురవుతాయన్నాడు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *