అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్..!
- NationalPolitics
- March 21, 2024
- No Comment
- 43
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అంతుకుముందు.. సుమారు రెండు గంటలపాటు ఆయన నివాసంలో సోదాలు జరిపిన అధికారులు కేజ్రీవాల్ ఫోన్ ను సీజ్ చేశారు.
దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం ఆయనకు పదోసారి సమన్లు ఇచ్చేందుకు వెళ్లిన తర్వాత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కేజ్రీవాల్ను దాదాపు రెండు గంటలపాటు విచారించి అదుపులోకి తీసుకున్నారు. తాజా పరిణామాలతో సీఎం ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
మరోవైపు ఆప్ కార్యకర్తలు, నేతలు చేరుకుని కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేజ్రీవాల్ నివాసం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ హాజరయ్యేందుకు నిరాకరించారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయినప్పటికీ.. ఆయనే సీఎంగా కొనసాగుతారని మంత్రి అతిషీ స్పష్టం చేశారు. జైలు నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని చెప్పుకొచ్చారు. సీఎంను ఈడీ అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఆమె తెలిపారు. ఇక లోక్సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్ట్ పెద్ద కుట్రేనని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపించారు.