మహాగణపతి నిమజ్జనానికి వేళాయే..!
- Telangana
- September 27, 2023
- No Comment
- 339
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం వీలైనంత త్వరగా ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేయనున్నారు. గణేషుడి శోభయాత్ర కోసం బాలానగర్ నుంచి ట్రాలీని రప్పించారు. ఇవాళ రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్ గార్డెన్ కు భారీ క్రేన్ చేరుకోనుంది. రాత్రి 10 గంటల నుంచి విగ్రహం తరలింపునకు ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి.
అర్ధరాత్రి 12 గంటలకు చివరి పూజా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఒంటిగంట తర్వాత గణపతిని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కదిలించనున్నారు. రేపు ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు వెల్డింగ్ పనులు చేపట్టనున్నారు. రేపు ఉదయం 7 గంటలకు శోభాయత్ర ప్రారంభం కానుంది. టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా రేపు ఉదయం 9గంటల 30నిమిషాలకు ఎన్టీఆర్ మార్గ్ కు ఖైరతాబాద్ బడా గణేష్ చేరుకుంటుంది. రేపు ఉదయం 10గంటల 30నిమిషాల నుంచి 11 గంటల వరకు క్రేన్ నెంబర్ 4 దగ్గర పూజ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల తర్వాత మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల లోపు మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.