ఇందిరాగాంధీ చీకటి కోణం.. స్నేహితురాలిపైనే పగ తీర్చుకుందా?

గాయత్రీదేవి ప్రపంచంలోనే అత్యంత అందమైన మహారాణి.. మరోవైపు.. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఇందిరాగాంధీ.. ఇద్దరు కలసి చదువుకున్నా.. ఇందిరాగాంధీకి గాయత్రీ దేవి అంటే ఎంతో అసూయ అట. చిన్నప్పటి నుంచి ఇద్దరూ స్నేహితులే అయినా.. ఇందిరాగాంధీ మాత్రం గాయత్రీ దేవిపై పగ తీర్చుకునేందుకు కొన్నేళ్లపాటు ఎదురుచూసిందట. అసలు ఇద్దరి మధ్య ఎందుకు వైరం ఏర్పడింది? గాయత్రీ దేవి అంటే ఇందిరాగాంధీకి ఎందుకంత కోపం. గాయత్రీదేవి వర్సెస్ ఇందిరాగాంధీగా అప్పటి పరిణామాలు ఎలా సాగాయి. ఇప్పుడు చూద్దాం..

గాయత్రీదేవి రాచరిక కుటుంబంలో పుట్టింది. 1919లో కుచ్ బెహార్ ర్యాజ్యాన్ని పాలించిన జితేంద్ర నారాయణ్, ఇందిరా దేవి దంపతులకు గాయత్రీదేవి జన్మించింది. బాల్యం నుంచే ఆమె మహారాణిలా పెరిగింది. జైపూర్ పాలకుడు మాన్ సింగ్ కు మూడో భార్యగా వెళ్లింది గాయత్రీదేవి. మాన్ సింగ్ ఇద్దరు భార్యలు ఉన్నట్లుగా తాను ఉండలేనని.. తన ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని గడుపుతానని ఆమె పెళ్లికి ముందే చెప్పింది. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళల జాబితాలో గాయత్రీ దేవి చోటు దక్కించుకుంది.

ఇదిలా ఉంటే.. గాయత్రీ దేవి, ఇందిరా గాంధీ ఇద్దరూ బాల్యం నుంచే ఒకరికిఒకరు తెలుసు. ఇద్దరూ పశ్చిమ బెంగాల్‌లోని రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన.. శాంతినికేతన్ స్కూల్ లో చదువుకున్నారు. అయితే.. అప్పటినుంచే గాయత్రీ దేవి అంటే ఇందిరాగాంధీకి ఇష్టం ఉండేది కాదట. స్వతహాగా రాజరికంలో పుట్టింది కాబట్టి ఆభరణాలు, అందం, రాజసం ఆమె సొంతం. ఇక గాయత్రీదేవి స్కూలుకు కూడా పెద్దపెద్ద కార్లలో వచ్చేదట. ఇదంతా చూస్తున్న ఇందిరాగాంధీకి లోలోపల అసూయ పెరిగిపోయిందట. పాఠశాలలోనే కాదు.. లండన్ లోనూ వీరిద్దరూ క్లాస్ మెట్స్ గా ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారు. ఈ ఇద్దరి మధ్య ప్రపంచానికి తెలియని పెద్ద సంఘర్షణే జరిగినట్లు కొందరు చర్చించుకుంటున్నారు. ఇందిరాగాంధీ చేతిలో పదవి ఉంటే.. గాయత్రీదేవి చేతిలో రాజరికం ఉందని అప్పట్లో చెప్పుకునేవారు.

ఇదిలాఉంటే.. 1965లో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గాయత్రీదేవికి పార్టీలో చేరే అవకాశం ఇచ్చారు. జైపూర్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి లక్షా 92వేల ఓట్లతో ఆమె విజయం సాధించారు. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ అయిన.. సి రాజగోపాలాచారి స్థాపించిన స్వతంత్ర పార్టీ నుంచి ఆమె పోటీ చేశారు. ఆ తర్వాత స్వతంత్ర పార్టీ.. జన్ సంఘ్‌తో పొత్తు పెట్టుకుంది.ఇక, ఇందిరాగాంధీ నాయకత్వంలో భారత ప్రభుత్వ విధాన మార్పుల కంటే.. రాయల్టీ పట్ల ఆమెకున్న అసహ్యం ఎక్కడా కనిపించలేదు. 1971లో భారత రాజ్యాంగంలోని 26వ సవరణ ద్వారా ప్రైవీ పర్సులు అంటే.. మాజీ రాచరిక రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేసిన చెల్లింపులు రద్దు చేయబడ్డాయి.

1975 జూన్‌లో ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, తన శత్రువులుగా భావించిన వారి అరెస్టులు కొనసాగించారు. అదే సమయంలో.. గాయత్రీదేవి ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేశారు. విదేశీ మారకపు పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద గాయత్రీ దేవిని అరెస్ట్ చేశారు. గాయత్రీ దేవిని 1975 జూలైలో తీహార్ జైలులో ఉంచారు. అక్కడ ఆమె ఎమర్జెన్సీ సమయంలో దాదాపు ఆరు నెలలు గడిపారు. రాజీవ్ గాంధీకి చెందిన ఫామ్‌హౌస్‌లో పనిచేసే వారితో సహా.. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసే ఫామ్‌హౌస్ కార్మికులను ఆర్గనైజ్ చేసినందుకు జైలు శిక్ష అనుభవిస్తున్న శ్రీలత స్వామినాథన్ అనే ఎన్జీవో వర్కర్‌తో పాటు.. గాయత్రీదేవిని ఒకే సెల్ లో ఉంచారు.

జైలులో ఉన్నప్పుడు గాయత్రీ దేవి పిల్లలకు పాఠాలు చెప్పింది. పలకలు, పాఠ్యపుస్తకాలు ఏర్పాటు చేసింది. పిల్లల కోసం బ్యాడ్మింటన్ కోర్టును ఏర్పాటు చేయడంలో ఆమె సహకరించింది. ఆమె జైలు జీవితం ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. అంతేకాకుండా రాజకుంటుబానికి చెందిన ఆమె.. జైలు జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి అనేక షరతులపై ఆమె పెరోల్‌పై విడుదలైంది. ఆ షరతులు 1977 వరకు అమలులో ఉన్నాయి. అయితే ఎ ప్రిన్సెస్ రిమెంబర్స్: ది మెమోయిర్స్ ఆఫ్ ది మహారాణి ఆఫ్ జైపూర్ అనే ఆత్మకథ 1976లో విడుదలైంది.
ఇందిరా గాంధీని ఎదిరించి అనేక ప్రతిపక్ష పార్టీలతో కలిసి 1977 ఎన్నికలలో జనతా పార్టీ చేతిలో ఓడిపోయింది. అయితే గాయత్రీ దేవి మళ్లీ రాజకీయాల్లోకి రాలేదు. ఇక, పక్షవాతం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో పోరాడిన గాయత్రీ దేవి.. 2009 జూలైలో మరణించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *