సామాన్యురాలిని పెళ్లాడిన బ్రూనై యువరాజు
- Entertainment
- January 13, 2024
- No Comment
- 57
ఆసియాలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన బ్రూనై యువరాజు ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
బ్రూనై దేశానికి చెందిన యువరాజు అబ్దుల్ మతీన్ ఒక సామాన్యురాల్ని వివాహం చేసుకున్నాడు. పది రోజులపాటు అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. 1788 గదులు ఉన్న ప్యాలెస్లో ఊరేగింపు వేడుకతో వివాహం ముగింపు దశకు చేరుకోనుంది. 32 ఏళ్ల బ్రూనై యువరాజు అబ్దుల్ మతీన్ 29 ఏండ్ల యాంగ్ ములియా అనీషా రోస్నాను ఇస్లామిక్ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన బ్రూనై రాజకుటుంబంలోకి సాధారణ అమ్మాయి అనీషా అడుగుపెట్టింది. అనిషా తండ్రి సుల్తాన్ హసనల్ బోల్కియాకు నమ్మకమైన సలహాదారు. ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన సుల్తాన్ హసన్నల్ బొల్కియాకు మతీన్ 10వ సంతానం.
ప్రిన్స్ మతీన్, హాలీవుడ్ హీరోకి మించి తన ఫ్యాషన్ స్టయిల్ను చాటుకుంటూ ఉంటాడు. ఫైటర్ జెట్స్,, స్పీడ్ బోట్లను నడుపుతూ వర్కౌట్లు చేస్తూ ఉంటాడు. బాక్సింగ్ , ఫోటోగ్రఫీ అంటే అతడికి చాలా ఇష్టం. అలాగే ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ను పోస్టు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. మతీన్ ఎక్కువగా మిలిటరీ యూనిఫాంలో ఫోటోలు దిగుతూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు.