వెళ్లాలంటే బాధగా ఉంది.. తమిళిసై భావోద్వేగం

రాజకీయాల్లోకి వెళ్తుంటే ఓ పక్క సంతోషంగా ఉన్నా.. మరోవైపు తెలంగాణ ప్రజలను వీడి వెళ్తున్నందుకు బాధగా ఉందని భావోద్వేగానికి లోనయ్యారు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్. తెలంగాణ ప్రజలను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానన్నారు. తను తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ సోదరినే అన్నారు. తను తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన రోజులను ఎప్పటికీ మరిచిపోలేనని ఎమోషనల్ అయ్యారు. అంతకుముందు తన.. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం ఆమె రాజీనామా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన తమిళిసై.. ఈసారి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె పుదుచ్చేరి సీటును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే.. బీజేపీ అధిష్టానం చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి నుంచి తమిళిసైని రంగంలోకి దింపనున్నట్లు సమచారాం. ఇక తమిళనాడులో బీజేపీ బలోపేతం కావటంలో ఆమె పాత్ర కీలకమైంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా, జాతీయ కార్యదర్శిగా పలు పదవులను నిర్వహించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *