ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్.. ఇక రణరంగమే..!
- TelanganaPolitics
- February 7, 2024
- No Comment
- 75
తుంటి ఎముక సర్జరీ అనంతరం కోలుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ తెలంగాణ భవన్ కు రాగానే.. అక్కడున్న నాయకులు, కార్యకర్తలు జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
కృష్ణా జిల్లా పరిరక్షణ ఏర్పాట్లపై.. మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. ఆఖరికి డ్యాములకు సున్నం వేయాలన్నా బోర్డు అనుమతి తీసుకోవాల్సి వస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పోరాటం చేయడం కొత్త కాదని.. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే చూస్తూ ఎలా ఊరుకుంటామన్నారు.
తమ పోరాటం నల్గొండ సభతో ఆగిపోదని కేసీఆర్ అన్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడతామన్నారు.