దత్తాత్రేయ కుమార్తెకు బీజేపీ షాక్
- PoliticsTelangana
- November 2, 2023
- No Comment
- 325
తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈసారి చాలా చోట్ల ఆయా పార్టీల్లోని చాలా మంది సీనియర్ నేతలు తమ వారసులను రంగంలోకి దించుతున్నారు. అందులో భాగంగా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి.. తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. ఇప్పటికే ఆమె బీజేపీలో కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. బీజేపీ దత్తాత్రేయకు షాక్ ఇచ్చింది. ముషీరాబాద్ సీటు ఆశించిన దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మీకి టికెట్ ఇవ్వకుండా.. పూస రాజుకి టికెట్ ప్రకటించారు. ఇదిలా ఉంటే విజయలక్ష్మీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి కాల్స్ వస్తున్నాయి. ఎంపీ లేదా ఎమ్మెల్సీ ఇస్తామంటూ ఆమెకు ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం.