బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం
- Telangana
- October 26, 2023
- No Comment
- 321
మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదని ఆయన చెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట్ డివిజన్ లో.. గొల్ల కొమురయ్య కాలనీ, గాంధీనగర్, రామస్వామి కాంపౌండ్, బర్కల్ బస్తీలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభివృద్దికి కేరాఫ్ గా సనత్ నగర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడం జరిగిందని.. అభివృద్ది చేసిన పార్టీకి ఓట్లు వేసి పట్టం కట్టాలని కోరారు. ఏ బస్తీకి, ఏ కాలనీకి వెళ్ళినా ప్రజలు స్వచ్చందంగా.. మంగళహారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వస్తే.. మళ్లీ అభివృద్ధి వెనక్కి పోతుందని, అమలు కాని హామీలతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని తలసాని శ్రీనివాస్ మండిపడ్డారు.