జనసేనానిపై విరుచుకుపడ్డ వైసీపీ మంత్రులు

జనసేనానిపై విరుచుకుపడ్డ వైసీపీ మంత్రులు

ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ఎప్పుడు ఎవరు ఎవర్ని తిట్టుకుంటారో అర్థం కాదు. తెలంగాణలో ఎన్నికలు ఒక ఎత్తు అయితే.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మరో ఎత్తు. ప్రత్యర్థి ఎవరైనా సరే మాటల తూటాలు పేల్చడంలో తమకంటే ఎవరూ మించిపోలేరు అన్నంతగా వ్యవహరిస్తారు ఏపీ రాజకీయ నేతలు. టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడిగా నిర్వహించిన బహిరంగ సభ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజేసింది.

ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీచ్‭పై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. తెల్లవారింది మొదలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి పవన్‭ను ఏకి పారేస్తున్నారు. అసలు సీఎం జగన్ ను తిట్టడానికే సభ పెట్టారంటూ వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు పవన్ కు లేవంటూ ఫైరయ్యారు. చంద్రబాబును రాసిన స్క్రిప్ట్ ను జనసేనాని ఫాలో అవుతున్నారంటూ తిట్టిపోశారు. స్టేజ్ మీద అందరి ముందు ఊగిపోతూ మాట్లాడితే ఓట్లు రాలవంటూ రోజా కౌంటరిచ్చారు. చంద్రబాబుకు ఊడిగం చేయడంతోనే పవన్ కళ్యాణ్ అథపాతాళానికి పడిపోయాడని విమర్శలు గుప్పించారు.

టీడీపీ జనసేన పొత్తు అట్టర్‌ఫ్లాప్‌ అయ్యిందని మంత్రి అంబటి రాంబాబు ఎద్దెవ చేశారు. తాడేపల్లిగూడెం సభలో ఏం సందేశం ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. పవన్‌ షేరింగ్‌ గురించి మాట్లాడతారేమోనని అంతా ఎదురుచూస్తే.. పవర్‌ స్టార్‌ అన్నారు కానీ.. పవర్‌షేరింగ్‌ ప్రస్తావన తేలేదని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ను దూషించడం కోసమే జెండా సభ జరిగినట్లుందని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.

Related post

తెరపైకి ఐఆర్ఆర్ కేసు.. ఏ1 నిందితుడిగా చంద్రబాబు

తెరపైకి ఐఆర్ఆర్ కేసు.. ఏ1 నిందితుడిగా చంద్రబాబు

ఏపీ రాజకీయాలు గంటకో విధంగా మారుతున్నాయి.
భోగి వేడుకల్లో మంత్రి అంబటి స్టెప్పులు

భోగి వేడుకల్లో మంత్రి అంబటి స్టెప్పులు

రాజకీయాల్లోనూ కొందరు నేతలు తమకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు.
ఫైబర్ గ్రిడ్ కేసులో ఆస్తుల జప్తుకు ఏసీబీ ఆదేశాలు

ఫైబర్ గ్రిడ్ కేసులో ఆస్తుల జప్తుకు ఏసీబీ ఆదేశాలు

ఏపీ ఫైబర్ గ్రిడ్‌ కుంభకోణం కేసులో ఆస్తుల జప్తుకు విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో మొత్తం రూ.114 కోట్ల ఆస్తులను జప్టు చేసేందుకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *