కేసీఆర్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారు- వివేక్ వెంకటస్వామి

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ సాధన కోసం ముందడుగు వేశామని… అందరి సమిష్టి కృషితో వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారంటూ వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పాలన, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారని ఆయన ఫైర్ అయ్యారు. నాలుగేళ్లుగా కేసీఆర్ రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశానని ఆయన అన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరంను రీ డిజైన్ చేశారని వివేక్ ఆరోపించారు. కేసీఆర్‌ను ఓడించాలని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్‌లోకి రావాలని తనను ఆహ్వానించారని.. మల్లికార్జున ఖర్గే ఆశీస్సులతో కేసీఆర్ రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేస్తానని వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఎన్నికల్లో పోటీ అనేది అధిష్టాన నిర్ణయం అని స్పష్టం చేశారు.

Related post

నా దమ్మేంటో దేశమంతా తెలుసు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌ ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సభలో టీపీసీసీ…

టీబీజేపీలో గ్రూపు రాజకీయాలు.. అసంతృప్తిలో సీనియర్లు

1. తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయి. రోజురోజుకి అసంతృప్త నేతలు బహిరంగంగా నిరసన తెలుపుతున్నారు. పార్టీలో ముందు నుంచి ఉన్న తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని..…

కేసీఆర్ పై ఎందుకు ఈడీ దాడులు చేయలేదు- రేవంత్

బీఆర్ఎస్ ను గెలిపించడానికే మోడీ పదే పదే రాష్ట్రానికి వస్తున్నారని.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీకి మొదటి నుంచి బీఆర్ఎస్ మద్దతుగా ఉందన్నారు. కీలక బిల్లుల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *