కేసీఆర్ పై ఎందుకు ఈడీ దాడులు చేయలేదు- రేవంత్
- Telangana
- October 4, 2023
- No Comment
- 306
బీఆర్ఎస్ ను గెలిపించడానికే మోడీ పదే పదే రాష్ట్రానికి వస్తున్నారని.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీకి మొదటి నుంచి బీఆర్ఎస్ మద్దతుగా ఉందన్నారు. కీలక బిల్లుల ఆమోదంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిచ్చిందని చెప్పారు. మోడీ తొమ్మిదేళ్ల పాలనలో విపక్ష సీఎంలపై ఈడీ దాడులు జరిగాయని.. మరి సీఎం కేసీఆర్ పై ఎందుకు ఈడీ దాడులు జరగలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అవినీతి చేశారని ఆరోపణలు చేసినప్పుడు మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు రేవంత్. బీఆర్ఎస్ అవినీతి చేస్తుంటే కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోకపోవడానికి వాటాలు, మూటలే కారణమని ఆరోపించారు. కొడుకును సీఎం చేయడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడంపై కేసీఆర్ ప్రధాని మోడీతో చర్చించారని తెలిపారు. వీరిద్దరు ఒకటేనని చెప్పడానికి మోడీ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు రేవంత్.