LIQUOR SCAM: కవిత, కేటీఆర్ టార్గెట్గా సుఖేష్ లేఖ
- Telangana
- December 8, 2023
- No Comment
- 78
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసును దర్యాప్తు చేస్తున్న సంస్థలకు సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది.
ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఏడాదిన్నరగా దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. లిక్కర్ కేసులో నిందితునిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తిహార్ జైలు నుంచి లెటర్లు విడుదల చేసే పర్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, కవితను టార్గెట్గా ఇటీవల వరుసగా సుఖేష్ లేఖలు రూస్తూనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత, కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ విషయంలో కేటీఆర్ వర్సెస్, సుఖేష్ మధ్య సవాళ్ల పర్వం నడిచింది. ఈ క్రమంలో తాజాగా సుఖేష్ మరోసారి కేటీఆర్, కవితను టార్గెట్ చేస్తూ మరో లేఖను విడుదల చేయడం సంచలనంగా మారింది. డియర్ కేటీఆర్ బ్రదర్.. కవిత అక్కయ్య అని పదే పదే సంబోధిస్తూ జైలు నుంచి తన అడ్వకేట్ ద్వారా పంపిన లేఖ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. మీ అబద్ధాలు, అత్యాశలు, అవినీతి ప్రజలందరికీ అర్థమైనట్లుంది అందుకే.. ఎన్నికల ఫలితాలతో ప్రజలు మీకు సరైన తీర్పు ఇచ్చారంటూ సుఖేష్ లేఖలో పేర్కొన్నారు.