తెలంగాణ సంస్కృతికి ప్రతీక అలయ్ బలయ్

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, వీహెచ్‌, కిషన్‌రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అలయ్.. బలాయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత 17 ఏళ్లుగా దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలయ్‌ బలయ్‌ కార్యక్రమం కొనసాగుతోంది
తెలంగాణ సంస్కృతి, ఆచారాలు ఎంతో గొప్పవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 2005 సంవత్సరంలో దత్తాత్రేయ ప్రారంభించిన అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణకు చెందిన వారిని మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను కూడా ఆహ్వానించారని, దీంతో మన సంస్కృతి గురించి వారికి కూడా తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పారు.

Related post

LIQUOR SCAM: కవిత, కేటీఆర్ టార్గెట్‭గా సుఖేష్ లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసును దర్యాప్తు చేస్తున్న సంస్థలకు సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తి…

కేసీఆర్‭కు మేజర్ సర్జరీ

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..…

వంద సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం- ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో మళ్లీ అధికారం తమదే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వంద సీట్లతో హ్యాట్రిక్ సర్కార్ ఏర్పాటు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీల మేనిఫెస్టోను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *