18 ఏళ్ల తర్వాత సీడబ్ల్యూసీ సమావేశాలు
- Telangana
- September 16, 2023
- No Comment
- 339
హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీకి కాంగ్రెస్ లోని కీలక నేతలంతా హాజరయ్యారు. ముసాయిదా తీర్మానంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చిస్తోందని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తెలిపారు. ఇంకా చర్చలు కొనసాగుతున్నాయన్నారు. CWC సమావేశంలో దేశంలోని పరిస్థితుల గురించి చర్చిస్తున్నామన్నారు. దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలు, భద్రతా బెదిరింపులు దేశానికి పెను సవాళ్లను విసురుతున్నాయన్నారు.
2. ఇండియా కూటమి సమావేశాలు విజయం కావడంతో.. బీజేపీ ప్రతిపక్షాలపై దాడులకు దిగుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశం తీవ్రమైన అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. స్థానికంగా చెలరేగుతున్న హింసాత్మక ఘటనలు.. భారత ప్రగతిశీల, లౌకిక ప్రతిష్ఠను దిగజార్చుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అగ్నికి ఆజ్యం పోస్తోందని ఆయన చెప్పారు. హైదరాబాద్ లో జరుగుతోన్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా ఖర్గే ప్రారంభోపన్యాసం చేశారు.